హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఐదు వందల మంది విద్యార్థులకు ఒక స్కూల్ కౌన్సెలర్ను తప్పనిసరిగా నియమించాలని, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ను అమలుచేయాలని పలు రాష్ర్టాలు కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. మధ్యాహ్న భోజనాన్ని వండేందుకు సిలిండర్లను సరఫరా చేయాలని సూచించాయి. స్కూల్ గ్రాంట్లో భాగంగా 15% సోలార్ ప్యానల్స్కు సస్టేనబిలిటీ గ్రాంట్ కింద ఇవ్వాలని ప్రతిపాదించాయి.
ఇప్పుడిచ్చే నిధులు సరిపోవడంలేదని, నిధులు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. సమగ్రశిక్ష పథకం గడువు 2026 మార్చి 31తో ముగియనున్నది. దీంతో మరో ఐదేండ్లపాటు ఈ పథకాన్ని పొడిగించాల్సి ఉంది. కేంద్ర విద్యాశాఖ ఈ నెల 7న అన్ని రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. రాష్ట్రం నుంచి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పలు సూచనలు చేశారు.