2 BHK House | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఒకవైపు పెరుగుతున్న భూముల ధరలు, మరోవైపు రుణాలపై పెరుగుతున్న వడ్డీ రేట్లతో మధ్య శ్రేణి ఇళ్ల వైపు ఎక్కువ మంది కొనుగోలుదారులు మొగ్గుచూతున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూంల ఇండ్ల పట్లనే అధిక శాతం ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వేలో వెల్లడైంది. దేశంలోని పలు మెట్రో నగరా ల్లో 5,218 మంది వినియోగదారులతో ఈ సర్వేను నిర్వహించామని అనరాక్ గ్రూపు చైర్మన్ అనూజ్పూరి తెలిపారు. బెంగళూరులో 51%, చెన్నైలో 50%, ఢిల్లీ ఎన్సీఆర్లో 47%, పుణేలో 45% మంది 3బీహెచ్కే ఇండ్ల పట్ల మొగ్గుచూపారని పేర్కొన్నారు.
హైదరాబాద్లో 47%, కోల్కతాలో 52%, ముంబైలో 41% మంది 2బీహెచ్కే ఇండ్ల పట్ల ఆసక్తి చూపారని తెలిపారు. రూ.45 లక్షల నుంచి రూ.1.5కోట్ల మధ్య ధర పలికే మధ్యశ్రేణి, ప్రీమియం క్యాటగిరి గృహాలను ఇష్టపడే వారి శాతం ఈ ఏడాది 10% పెరిగిందని చెప్పారు. సిద్ధంగా ఉన్న ఇండ్లను కొనుగోలు చేసేవారి శాతం, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసే వారి శాతం 28:27 నిష్పత్తిలో ఉన్నదని తెలిపారు. ఇది గత 2020లో 46:18 నిష్పత్తిలో ఉండేదని చెప్పారు. గృహాల కొనుగోలుదారుల అభిరుచులు, బడ్జెట్లో మార్పులు వచ్చాయని సర్వేలో వెల్లడైందని తెలిపారు.