వరంగల్ : జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడం స్థానికంగా కలకలంరేపింది. వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైందని డీఎంహెచ్వో డాక్టర్ కె వెంకటరమణ వివరాలను వెల్లడించారు. 24 నాలుగేండ్ల ఓ యువకుడు స్విట్జర్లాండ్ నుంచి డిసెంబర్ 12న వరంగల్ నగరానికి వచ్చాడు.
అతడికి సాధారణంగా కరోనా పరీక్షలు చేయగా ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్వో తెలిపారు. వెంటనే అతడిని హైదరాబాదులోని టిమ్స్ హాస్పిటల్కు మెరుగైన వైద్య సేవల కోసం పంపించామన్నారు.
అతడి దగ్గరి బంధుమిత్రులు 20 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపామన్నారు. ప్రజలంతా కరోనా, ఒమిక్రాన్ గురికాకుండా ఉండటానికి భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే మాస్కులు ధరిస్తూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని డాక్టర్ వెంకటరమణ తెలిపారు.