ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోయం మంగమ్మ(60)కు చెందిన ఇల్లు ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం గమనించిన స్థానికులు మంగమ్మ మృత దేహాన్ని బయటకు తీశారు.
మంగమ్మకు ఓ కుమారుడు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం లో ఉంటున్నాడు. రెవెన్యూ అధికారులు కూలిన ఇంటిని పరిశీలించి పంచనామా ప్రక్రియ నిర్వహించి, కలెక్టర్ కు నివేదించారు.