యాదగిరిగుట్ట, జనవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో రామకృష్ణారావు ఆదివారం తెలిపారు. కాగా ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తేదీల్లో నిత్య కల్యాణం, హోమాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 22న రాత్రి 8 గంటలకు నిర్వహించే స్వామివారి కల్యాణ టికెట్ను రూ.600గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవాన్ని పాతగుట్ట ఆలయం ముందుభాగం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ఊరేగిస్తామని, 25న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు పరిపూర్ణం అవుతాయని తెలిపారు.