హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : నోటిఫికేషన్ ఆధారంగానే సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ను వర్తింపజేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధానకార్యదర్శి చీటి భూపతిరావు ప్రభుత్వాన్ని కోరారు. 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ విడుదలయ్యి, ఆ తర్వాత ఉద్యోగాలు పొందిన ఉద్యోగులను సీపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చారని వారు గుర్తుచేశారు.