హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర ముగింపు మహాసభను ఈ నెల 12న నిర్వహిస్తున్నట్టు సీపీఎస్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, కార్యదర్శులు శ్రీకాంత్, నరేశ్గౌడ్ గురువారం తెలిపారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగిన సన్నాహక సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ జ్యుడీషియల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీను, పవన్, కోటకొండ పవన్, మల్లికార్జున్, రోషన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు, నటరాజ్ పాల్గొన్నారు.