వినాయక్ నగర్, అక్టోబర్ 17: పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపిన ఘటన నిజామాబాద్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. చైన్స్నాచర్ రియాజ్పై సీసీఎస్కు సమాచారం వచ్చింది. దీంతో సీసీఎస్ ఎస్సై భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి బైక్పై బ యల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో అతడిని పట్టుకున్న పోలీసులు.. తనిఖీ చేయకుండానే ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్పై ఎక్కించుకున్నారు. వినాయక్నగర్ వద్ద నిందితుడు కత్తి తీసి కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యా డు. ప్రమోద్ను దవాఖానకు తరలించ గా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహా న్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. సీపీ సాయిచైతన్య దవాఖానకు చేరుకొని వివరాలు ఆరా తీశారు.