హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీఎడీఎంఏ) ఎన్ సత్యనారాయణ ఆదేశించారు.
పీసీబీ అధికారులతో కలి సి తనిఖీలు చేపట్టాలని అన్ని జోనల్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. శనివారం హోల్ సేల్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. శుక్రవారం వీధి వ్యాపారులు, పూల వ్యాపారులు, స్థానిక మార్కెట్దారుల దుకాణాలను తనిఖీ చేశారు.