చేర్యాల : భక్తుల(Devotees) కొంగుబంగారం కొమురవెల్లి (Komuravelli) మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర పర్యవేక్షణలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో మల్లికార్జునుడి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయితే మల్లన్న జాతరలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కోసం మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తుల వాహనాలను మూడు కిలోమీటర్ల ముందే ఆపేశారు. భక్తులను ఐదు గంటల పాటు రోడ్డుపైనే నిలబెట్టి దైవ దర్శనం చేసుకోకుండా అడ్డుకుని ప్రత్యక్ష నరకం(Officials harassed) చూపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పుకుంటున్న అధికారులు ఇలా గంటలు గంటలు రోడ్డపైనే నిలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.