భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఒక వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలకు కసరత్తు (Panchayati Elections) జరుగుతున్న కొత్తగూడెం జిల్లాలోని ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలోని ఏడు పంచాయతీలు కలడంతో ఈ ఎన్నికలకు అధికారులకు సవాల్గా మారింది.
కార్పొరేషన్ మాట అటుంటే పరిషత్ ఎన్నికలకు అన్నీ లైన్ క్లియర్ చేసేందుకు అధికారులు సిద్దం అయ్యారు. ఇప్పటికే భద్రాచలం మండలం కావడం తో అక్కడ ఓటర్లు తో పాటు సుజాత నగర్లో పాత ఎంపీటీసీల స్థానాలు లెక్క ఎప్పటి లాగానే చూపించారు. పాత లెక్కల ప్రకారం ఎంపీటీసీలు ఉంటే కార్పొరేషన్ ఏమైనట్టు అని అందరినీ ఆలోచనలో పడేసిన ప్రశ్న తొలిచేస్తోంది.
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి ఎంత వరకు అని అందరి లో సందేహాలు వస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లో ఏడు పంచాయతీలు కలిపి కార్పొరేషన్ అనేది స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాట. తాజాగా పత్రికా ప్రకటన కూడా చేశారు. మరి అధికారులు ఆ ఏడు పంచాయతీ లను వదలకుండా ఎంపీటీసీ స్థానాలు ఎట్లా చేశారనేది సర్వత్రా చర్చ జరుగుతున్నది.
ఇంతకీ ఎన్నికల సమయానికి ఎంపీటీసీలు, పంచాయతీలు తగ్గించి ఎన్నికలు పెడతారా లేక కార్పొరేషన్లో పంచాయతీలు తగ్గిస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం.