మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 38 గేట్లు ఎత్తి 2.56 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 7.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.51 మీటర్ల వద్ద నీరు ఉన్నది.
ఇక నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజ్టెకు 3.22 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తివేసి 4.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్తాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.60 అడుగుల వద్ద ఉన్నది. సాగర్ గరిష్ఠ నీటినిల్వ 312.04 టీఎంసీలు. ఇప్పుడు 298.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది.