ఈడబ్ల్యూఎస్ అర్హత జీవో ఇచ్చినందుకు ఓసీ జేఏసీ తీర్మానం
రవీంద్రభారతి, జూన్ 10: ఈడబ్ల్యూఎస్ అర్హత జీవో 244ను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకొన్న సీఎం కేసీఆర్కు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బషీర్బాగ్లోని సమాఖ్య కార్యాలయంలో ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అర్హులకు ఐదేండ్ల వయోపరిమితిని సడలింపు ఉత్తర్వులు ఆలస్యం కావటంతో సీఎం కేసీఆర్ స్పం దించి వెంటనే జీవో 244 అమలు చేయాలని ఆదేశించారని చెప్పారు. సమస్యను పరిష్కరించిన సీఎంకు, వినోద్కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓసీ జేఏసీ తీర్మానం ఆమోదించింది. సమావేశంలో పెండ్యాల కేశవరెడ్డి, గోపు జైపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.