హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పయనీర్ పత్రిక మహిళా జర్నలిస్టు నవీనపై ట్విటర్ (ఎక్స్) వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవారిపై సైబర్ క్రైమ్ పోర్టల్లో కేసు నమోదైంది.
కేటీఆర్ చిట్చాట్ను నవీన బుధవారం ఖాతాలో పోస్టు చేయగా, ఆమెను టార్గెట్ చేస్తూ @thewatcher6093 అనే టీడీపీ అభిమాని, మరికొంతమంది అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. దీంతో ఆమె వెంటనే సైబర్క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఆమెను ట్రోల్ చేసిన వ్యక్తి ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసుకున్నాడు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు ఆదేశించారు.