నిబద్ధతతో టీఆర్ఎస్లో పనిచేసే వారిని సీఎం కేసీఆర్ మరువరు
మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్
రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మెట్టు శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 3: పార్టీ పట్ల నిబద్ధత, విధేయతతో పనిచేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తప్పకుండా అవకాశం కల్పిస్తారని మం త్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. అందుకు మెట్టు శ్రీనివాసే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మెట్టు శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి వేము ల మాట్లాడుతూ.. ఉద్యమంలో మొదటి నుంచీ ఉన్న వీ ప్రకాశ్ ఎన్నికల రాజకీయాల్లో లేకున్నా సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించి జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించారని గుర్తు చేశారు.
ఓపిక అవసరం
పదవులను పొందాలంటే ఓపిక అవసరమని పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి 10 వేల మంది కార్యకర్తలతో ఐదేండ్ల క్రితం టీఆర్ఎస్లో చేరిన మెట్టు శ్రీనివాస్కు ఏ పదవీ రాకున్నప్పటికీ పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవం తం చేశారని గుర్తు చేశారు. ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించింది ఆయనేనని తెలిపారు. లక్ష్యం ఏదైనా దాన్ని సాధించేందుకు శ్రీనివాస్ కష్టపడి పనిచేసేవాడని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
సమయానుకూలంగా పదవులు
ఎప్పుడు ఎవరికి పదవులివ్వాలో సీఎం కేసీఆర్కు తెలుసని, సమయానుకూలంగా అందరికీ పదవులు లభిస్తాయని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీజేపీ నిత్యం అబద్దాలు, అసత్యాలు చెప్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ వైఖరిని ఎండగట్టాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలంతా సోమవారం నుంచి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టులు చేయలేని పని సీఎం కేసీఆర్ చేశారు: మెట్టు శ్రీనివాస్
సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నేత అని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పేర్కొన్నారు. కమ్యూనిస్టులు తమ రాష్ట్రాల్లో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసి చూపించారని కొనియాడారు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, త్రిపురతోపాటు ప్ర స్తుతం కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో ఇంత అభివృద్ధి జరుగలేదని, పేదల సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్నన్ని పథకాలు అక్కడ లేవని చెప్పారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తాతా మధు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మ న్ వీ ప్రకాశ్, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు తదితరులు మెట్టు శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు.