హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): జన గణనతోపాటు ఓబీసీ కుల గణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడిని పెంచుతామని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఓబీసీ కుల గణనకు మద్దతు తెలపాలని కోరుతూ అఖిలేశ్యాదవ్ను మన జన గణన వేదిక చైర్మన్ గోసుల శ్రీనివాస్యాదవ్ లక్నోలో బుధవారం కలిశారు. ఓబీసీ కుల గణన చేపట్టేందుకు బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, పార్లమెంట్లో ఎస్పీ ఎంపీలతో కేంద్రాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు అఖిలేశ్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఓబీసీ కుల గణన చేపట్టాలని కేంద్రానికి విన్నవించామని గుర్తుచేశారు. ఈ అంశంపై త్వరలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్యాదవ్ వెంట జనగణన వేదిక యూపీ ఇంచార్జులు మంతోష్యాదవ్, జైహింద్ కృష్ణ యాదవ్, బంటు యాదవ్ తదితరులున్నారు.