హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనగణలో భాగంగా ఓబీసీ కులగణ చేపట్టాలని 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు కోరారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అఖిలభారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో వారంతా ఢిల్లీలో రాహుల్గాంధీని శనివారం ప్రత్యేకంగా కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పదేండ్లుగా ఓబీసీ కులగణన నిర్వహించకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు బీసీలను నిర్లక్ష్యం చేసిందని, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయకుండా, బీసీ రిజర్వేషన్లు, క్రీమిలేయర్ పరిమితి పెంచకుండా అన్యాయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్ చేపట్టబోయే భారత్ జోడో న్యాయయాత్రకు మద్దతుగా నిలబడతామని తెలిపారు. రాహుల్ను కలిసిన వారిలో మాజీ ఎంపీ మధుయాషీగౌడ్, డాక్టర్ విజయభాసర్, డాక్టర్ చంద్రశేఖర్, బెల్లయ్యనాయక్, గొమాస శ్రీనివాస్, డాక్టర్ రవి, జనగాం రవీందర్గౌడ్తో పాటు 29 రాష్ట్రాల ప్రతినిధులున్నారు.