హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) మరోసారి నేడు భేటీ కానున్నది. ఏపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ర్టాలతో పాటు ఇతర పరీవాహక రాష్ర్టాలతో నేడు నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నది.
గత సమావేశాల్లో రాష్ర్టాలు తెలిపిన అభ్యంతరాలు, లేవనెత్తిన అంశాలకు ఎలాంటి జవాబు ఇవ్వకుండానే గోదావరి-కావేరి నదుల అనుసంధాన ఒప్పందంపై అభిప్రాయాలను సేకరించనున్నది. సమావేశానికి సంబంధించి ఎజెండాను ఇప్పటికే అన్ని రాష్ర్టాలకు అందజేసింది.