హైదరాబాద్ : మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాటలు పూర్తి అవాస్తవం. అబద్దాలు ఆడడంలో ఆయనను మించిన వారు లేరు. జోక్ ఆఫ్ ది ఇయర్గా మాజీ ఎమ్మెల్యే మాటలు ఉన్నాయని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
జెమ్ టెండర్లకు వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీశ్ రావుకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మాటలు పూర్తి అవాస్తవం అతడి ఆరోపణలు ఖండిస్తున్నానని ఎర్రోళ్ల తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ నాయకులని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ బీజేపీ లీడర్లు అబద్దాలు మాత్రమే ప్రచారం చేస్తారని విమర్శించారు.
రెండు ఏజెన్సీల పంచాయితీని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అంటకట్టడం అవగాహన రాహిత్యమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక లకు అనుగుణంగా జెమ్ టెండర్ లు వేశాం.
రెండు ఏజెన్సీల పంచాయితీని ఆరోగ్య శాఖకు అంటకడితే సహించమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారుర. ఒక్కరికి తొత్తుగా వ్యవహరించడం ఈ బీజేపీ కి దిక్కుమాలిన చర్య. ఈ టెండర్ ల ఇష్యు కోర్ట్ లో ఉంది. కోర్ట్ ఆదేశాల మేరకు పని చేస్తామని ఎర్రోళ్ల స్పష్టం చేశారు.
దమ్ముంటే రుజువు చెయ్యి లేదంటే ముక్కు నేలకు రాయని సవాల్ విసిరారు. ఆరోపణలు చేసేముందు అవగాహన ఉండాలి. ఆయనకు ఎలాంటి అవగాహన లేకుండానే ప్రెస్ మీట్ మాట్లాడి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడని తెలిపారు.