హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ ప్రకటించి తమ వేతన స్కేల్ను స్థిరీకరించాలని నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు సోమవారం పీఆర్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్లు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. హోదాలకు అనుగుణంగా వేతనాలు స్థిరీకించాలని కోరారు. గెజిటెడ్ హోదా ఉన్న డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్కు రవాణా అలవెన్స్ కల్పించాలని విన్నవించారు. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్కు గెజిటెడ్ హోదా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయమ్మ, ప్రధాన కార్యదర్శి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
ల్యాబ్ టెక్నిషియన్ల తరఫున ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతిపాదనలు సమర్పించారు. గత వేతన సవరణల్లో ల్యాబ్ టెక్నిషియన్ క్యాడర్కు అన్యాయం జరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈసారి న్యాయం చేయాలని, జీవిత కాల ఆరోగ్య ప్రమాదాలకు అలవెన్సు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్, ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్, కోశాధికారి రాజేందర్, ఉపాధ్యక్షుడు మహ్మద్ సలీం, కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.