రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి
టీడీఎఫ్- యూఎస్ఏ ప్రవాసీ తెలంగాణ దివస్లో మంత్రులు వేముల, ఎర్రబెల్లి
రవీంద్రభారతి, డిసెంబర్ 12: బంగారు తెలంగాణ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సూచించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్- యూఎస్ఏ) 6వ ప్రవాసీ తెలంగాణ దివస్ కార్యక్ర మంలో మంత్రులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర చాలా గొప్పదని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ ఎన్నారైలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని చెప్పారు. పలువురికి రాజకీయంగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలుగా సొంత ఊర్లను దత్తత తీసుకొని, విద్య, వైద్యరంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పా టు అందించాలని కోరారు. అనంతరం టీడీఎఫ్ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, సభా అధ్యక్షుడు కవితా చల్లా, టీడీఎఫ్ -యూఎస్ఏ అధ్యక్షురాలు ప్రీతి చల్లా, వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, ప్రశాంత్, నాయకులు రామ కులవర్ణం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.