హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణవాసులు రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. బుధవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్షతన జరిగిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో తొమ్మిదేండ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని మంత్రి అన్నారు. హైదరాబాద్కు అంతర్జాతీయంగా మరింత ఆదరణ పెరిగిందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడుల కోసం తెలంగాణకు వరుస కడుతున్నాయని వివరించారు.
మాట ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్కు మంత్రి నిరంజన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా 100 సీట్లతో గద్వాలకు మెడికల్ కళాశాలకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వ దవాఖాన భవనం అప్గ్రేడ్ చేస్తూ అవసరమైన వైద్య సామగ్రి కొనుగోలుకు అనుమతులు జారీ చేసింది.