ఆదిలాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘నాకు ఊళ్లో ఆరెకరాల పొలం ఉంది. తెలంగాణ రాకమునుపు కరంటుతో మస్తు గోస పడ్డం. 3 గంటలే కరంటు ఇచ్చేటోళ్లు. పొలానికి నీళ్లు పెట్టనికి రాత్రి, పగలు తేడా లేకుండా బావుల కాడ కాపలా కాసేటోళ్లం. పాములు, తేళ్లు కుడుతాయేమోనని భయపడేటోళ్లం. తెలంగాణ అచ్చినంక కరంటు గోస తీరింది. సీఎం కేసీఆర్ సార్ 24 గంటలు ఫ్రీగా కరంటు ఇస్తున్నడు.
కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చెప్తున్నాడు. వాళ్లు ఇచ్చే కరంటు ఓళ్లకు కావాలె? రైతులను కష్టాల పాల్జేసే కాంగ్రెస్కు ఓటెయ్యం. 24 గంటల ఫ్రీ కరంటు ఇచ్చే బీఆర్ఎస్కే ఓటేస్తాం’.. అని బోథ్ నియోజకవర్గం జాతర్ల గ్రామానికి చెందిన రైతు గంగయ్య తేల్చి చెప్పాడు. ఆదివారం గ్రామంలో ప్రచారం చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్తో కొద్దిసేపు ముచ్చటించాడు.