– ప్రభుత్వానికి నిరుద్యోగ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 20 : రాష్ట్ర పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే టీజీఎల్పీఆర్బీ బోర్డుకి, మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా ఎటువంటి స్పందన లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా ఒక్క పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. విడుదల చేసే నోటిఫికేషన్లో వయో పరిమితిని 35 ఏండ్లకు పెంచాలని, అలాగే జీఓ నంబర్ 46ను రద్దుచేసి, లాంగ్జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్. శింబునాయక్, సందీప్, చెర్రీ ప్రవీణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.