హైదరాబాద్ : ములుగు అటవీ కళాశాలల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 27 పోస్టులకు భర్తీకి టీఎస్పీఎస్సీ భర్తీ చేయనున్నది. సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.