హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణ, అదేరోజు తుది అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు. తొలిరోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ప్రజావాణి పార్టీ నుంచి పాటి శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య నామినేషన్లు వేశారు.