హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఈ సారి మహిళా అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ములుగు అటవీ కళాశాలలో 27 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వారంరోజులు గడవక ముందే మరో నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో 80,039 కొలువులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన నాటినుంచీ శరవేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకూ ఆర్థికశాఖ 49,455 ఉద్యోగాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
శనివారం టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 8 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుదారులు 1 జూలై 2004కు ముందు జన్మించినవారై ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్మెన్కు మూడేండ్లు, ఎన్సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కల్పించినట్టు వివరించారు. వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని వెల్లడించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్)కు వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని వెల్లడించారు. వివరాలకు https:// www.tspsc.gov.inను సంప్రదించాలని సూచించారు. సందేహాలు, ఫిర్యాదులకు 040-23542 185, 040-23542187 లేదా help desk@tspsc.gov.in సంప్రదించాలని అనితారామచంద్రన్ పేర్కొన్నారు.