వరంగల్ : రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఐఏపీజీఈటీ-2021 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఈ నెల 10న ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ ప్రకటనలో సూచించింది.