హైదరాబాద్ డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో ఓ పోస్టుకి అనుచిత కామెంట్ పెట్టిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసు ఇచ్చారు. పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలనే బెయిల్పై విడుదలయ్యారు.
ఫేస్బుక్లో ఓ పోస్టుకు రాజాసింగ్ కామెంట్ చేయడంపై మంగళ్హాట్ పోలీసులు మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలు పాటించకుండా ఓ మతంపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.