హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకిచ్చారో వివరణ తెలుపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీకి నీటి పారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తి కాకుండానే పూర్తయినట్టు నివేదించి తమను తప్పుదోవపట్టించడానికి బాధ్యులెవరో తేల్చి.. వివరాలు పంపాలని ఈఎన్సీ (జనరల్ ) మురళీధర్కు సూచించింది.