హైదరాబాద్ : ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ( MLA KP Vivekananda ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా పాలన ప్రగతి నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తుందని , ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు.
మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రజా పాలన పేరిట దగా కార్యక్రమాం నిర్వహిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మంచి చేయడం లేదని, పాలనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తాగునీటికి తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజానికానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేక పోతుందని అన్నారు.
కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి అద్భుతమైన పాలన అందించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళంగా నెలకొని ఉందని, ఆర్ధికంగా ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పైన కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుందని అన్నారు.