PM Modi | వరంగల్, జూలై 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన వరంగల్ బహిరంగ సభకు బీజేపీ అగ్రనాయకులు డుమ్మా కొట్టారు. వరంగల్ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని స్టార్ క్యాం పెయినర్గా చెప్పుకొనే మాజీ ఎంపీ విజయశాంతి, ఇటీవల తెలంగాణలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలను భుజాన వేసుకొని నడిపించిన మాజీ ఎంపీ వివేక్ ముఖం చాటేయడంపై బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చెన్నమనేని విద్యాసాగర్రావు గవర్నర్ పదవికాలం ముగియగానే మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన సైతం ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరుకాకపోవడం విశేషం. బీజేపీ రాష్ట్ర పార్టీలో జరుగుతున్న నాయకుల అసంతృప్తుల పర్వాన్ని మోదీ సభ బహిర్గతం చేస్తున్నది.