హైదరాబాద్ : సికింద్రాబాద్లోని బసేరా హోటల్లోని పబ్పై సోమవారం పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్యాన్సర్లు, పబ్ నిర్వాహికులతో సహా పది మంది యువతులు, 28 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రాంగోపాల్పేట టకీలా పబ్పై పోలీసులు దాడి చేసిన ఘటన మరవక ముందే బసేరా హోటల్లోని ఔట్ స్వింగర్స్ పబ్పై దాడి చేసి యువతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పబ్పై దాడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.