హైదరాబాద్ , డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్పేట ఎంపీడీవోతోపాటు మాజీద్పూర్ గ్రామ కార్యదర్శికి హైకోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఆక్రమణల తొలగింపుపై నివేదిక సమర్పించకపోవడం, నవంబర్ 18న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలన్న ఉత్తర్వులను పాటించకపోవడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మసనం శుక్రవారం ఈ వారెంట్లు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేకపోయామన్న వారి వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. ఈ నెల 11న జరిగే తదుపరి విచారణకు వారిద్దరినీ హాజరుపచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది.