మామిళ్లగూడెం, ఏప్రిల్ 24: ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.