Literacy | ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ( FLN) అమలు పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు క్లస్టర్కు సైతం ఒక నోడల్ ఆఫీసర్ను నియమించనున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి తొలిమెట్టు పేరుతో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం ప్రారంభం కానున్నది. ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ నిర్వహణ మార్గదర్శకాలను దేవసేన విడుదల చేశారు.
స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలే క్లస్టర్ నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని దేవసేన పేర్కొన్నారు. వీరు వారంలో రెండు రోజుల పాటు 1-5 తరగతుల నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతారు.
మండల నోడల్ ఆఫీసర్లు తమ పరిధిలోని స్కూళ్లలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అమలును రెండు నెలల లోపు పూర్తి చేయాలని దేవసేన తెలిపారు.. ఇక క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు తమ పరిధిలోని స్కూళ్లను నెలలోపు పూర్తి చేయాలని సూచించారు.