Reading activity | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థులను రోజుకు 30 నిమిషాలపాటు చదివించాలని విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం రీడింగ్ యాక్టివిటీని నిర్వహించాలని ఆదేశించింది. ఈ 30 నిమిషాల వ్యవధిలో పాఠ్యపుస్తకాలతోపాటు కథల పుస్తకాలు, దినపత్రికలు, మ్యాగ్జి న్లు చదివించాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. మంగళవారం ఆమె 202324 విద్యాసంవత్సర అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి బడులు పునః ప్రారంభంకానున్నా యి.
అదేరోజు నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ విద్యాసంవత్సరం 2024 ఏప్రిల్ 23న ముగుస్తుంది. మొత్తం 229 రోజులపాటు బడులు నడిచేలా అకడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 2024లో నిర్వహిస్తారు. 2024 జనవరి 10 నాటికే టెన్త్ సిలబస్ను పూర్తిచేస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం బడుల్లో ధ్యానం, యోగ తప్పనిసరి చేశారు. విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేయడంలో భాగంగా ఆర్ట్ అండ్ హెల్త్ యాక్టివిటీస్, మెంటల్ మ్యాథ్స్గేమ్స్, వర్డ్ అంత్యాక్షరి, మ్యూజిక్, డ్యాన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. నెలలో నాలుగో శనివారం ‘నో బ్యాగ్డేగా’ పాటించనున్నారు.
మరికొన్ని ముఖ్యాంశాలిలా..