కరీంనగర్ : రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు. టీఆర్ఎస్ రోజురోజుకు బలపడుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే దీనికి నిదర్శనమన్నారు. పట్టణాలు, పల్లెల్లోనూ ముఖ్యమంత్రిపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదు. మరో 20 సంవత్సరాల వరకు కేసీఆర్ ముందు ఏ శక్తి నిలబడదన్నారు.
హుజరాబాద్లో టీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం క్యాడర్ అంతా కేసీఆర్ వెంట ఉంటామని చెబుతున్నారు. ఎన్నికలు ఏవైనా కేసీఆర్ బొమ్మను చూసి ఓటు వేస్తున్నారు. వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో అందరితో మాట్లాడుతున్నామని తెలిపారు. పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు విచారణకు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది ఆ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.