గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టారన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ మణుగూరు గ్రామ, వార్డు కమిటీల అధ్యక్షుల నియామక కార్యక్రమానికి ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు గ్యాస్, పెట్రోల్ ధరల భారం మోయలేక పోతున్నారని తెలిపారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధానితో మాట్లాడి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.