హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టులో తాను కొత్తగా ఎలాంటి పిటిషన్ వేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారని పలు ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు’ అని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.