హైదరాబాద్: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్పై దవాఖాన ప్రాంగణంలో హత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇది భరించాల్సిన అంశం కాదని, మరీ ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరినీ వదిలిపెట్టకూడదని ఎక్స్ వేదిగా డిమాండ్ చేశారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్తుడిని పట్టుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. దవాఖానలో వైద్యులు సురక్షితంగా ఉండలేకపోతే, మన ఆడపిల్లలు ఎక్కడైనా క్షేమంగా ఉంటారా అని ప్రశ్నించారు.
కాగా, కోల్కతాలో ఆర్జీ కర్ కాలేజీలో 28 ఏండ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్రాయ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ డివైజ్ అతని మెడలో ఉంది.
40 నిముషాల అనంతరం బయటకు వచ్చేటప్పుడు అది అతడి మెడలో లేదు. కొంతసేపు పెనుగులాట తర్వాత డాక్టర్ను గొంతు పిసికి చంపినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడన్నారు. సంజయ్ రాయ్కు ఇదివరకే నాలుగుసార్లు పెండ్లిండ్లు అయ్యాయి. అయితే అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది. సంజయ్ రాయ్ పోలీస్ పౌర వాలంటీర్గా పనిచేస్తున్నాడు
The alleged rape and murder of a 31 year old doctor while on duty at RG Kar Medical College, Kolkata in the hospital premises is shocking
My heart goes out to the victim’s parents, family and friends. No one should have to endure this. And no one who has resorted to such…
— KTR (@KTRBRS) August 12, 2024