హైదరాబాద్: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా టెస్టులు చేసి, పాజిటివ్ ఫలితం వస్తే వెంటనే జీనోమ్ టెస్టుల కోసం పంపుతున్నారు. ఇలాంటి సమయంలో విదేశాల నుంచి తెలంగాణ రాష్ఠ్రానికి వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో వెంటనే వీరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. ఈ ఫలితాల్లో ఎవరికీ ఒమిక్రాన్ సోకలేదని తేలింది. మొత్తం 13 శాంపిల్స్ కూడా ఒమిక్రాన్ నెగిటివ్గా తేలినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, మహారాష్ట్రలో సోమవారం నాడు కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య పదికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 23 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.