హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ లో చిచ్చు రగిల్చేందుకు బీజేపీ కుట్ర రాజకీయాలకు తెరతీపిందని, ఇందులో భాగమే మునుగోడు ఉపఎన్నిక అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్లు ఎన్ని గిమ్మిక్కులు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. ఈ మేరకు శనివారం ఆయ న ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఉపఎన్నిక ను ప్రజలపై రుద్దడం ఎంతవరకు సబ బు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ నేతల వెన్ను లో వణుకు పుడుతున్నదన్నారు. మునుగోడు ప్రజలు ఎంతో చైతన్యవంతులని, బీజేపీ అభ్యర్థికి తగిన గుణపాఠం చెప్పుతారని పేర్కొన్నారు.