హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పాటు థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ ఉండబోవని ఇది వరకే చెప్పామని, మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నామన్నారు. జనవరి చివరలో లాక్డౌన్ ఉండవచ్చని తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలుంటాయని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు.