హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఆలయంలో ఆర్జిత అభిషేకాలను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్టు దేవస్థానం ఈవోడీ పెద్దిరాజు వెల్లడించారు. శనివారం వైకుంఠ ఏకాదశి, ఆదివారం వారాంతపు సెలవు కారణంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్టు తెలిపారు.
ఆర్జిత అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. రోజూ నాలుగు విడతల్లో స్పర్శ దర్శనానికి అవకాశం ఇస్తామని,. దేవస్థానం వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందాలని సూచించారు.