NMMS | హైదరాబాద్ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షను ఈ నెల 10న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లను https//bse.telanangana.gov. in వెబ్సైట్లో పొందుపరిచామని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్తో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.