Rajanna Sircilla Medical College | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాలేజీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా.. నేషనల్ మెడికల్ కమిషన్ శనివారం అనుమతి ఇచ్చింది. కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్ల అనుమతులు జారీ చేసింది. దాంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడ్డట్లయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాలేజీతో కలిపి మొత్తం ఏడు కాలేజీలకు అనుమతి వచ్చింది. మరో రెండు కాలేజీలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒకేసారి రికార్డు స్థాయిలో సీఎం కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి రావడంపై మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. వంద ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు కాలేజీలకు అనుమతి వచ్చిందన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజీతో సీఎం కేసీఆర్ ఆశయం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.