హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఓ యువకుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారా గ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు. 40 ఫీట్ల పొడవున్న ఈ ఫ్లెక్సీ ఆకాశంలోకి ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ కవితకు పబ్బ సాయి ప్రసాద్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆయనను పలువురు అభినందించారు.