హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యువకుడిని అపహరించిన కొద్దిగంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్లోని పాలిటెక్నికల్ కళాశాల వద్ద ఓ యువకుడిని ముగ్గురు యువకులు చితకబాదారు. ఆ తర్వాత బలవంతంగా కారులో ఎక్కించుకొని పరారయ్యారు. ఈ ఘటన నిజామాబాద్లో కలకలం సృష్టించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు టీఎస్29సీ 6688 నంబరు గల కారులో యువకుడిని ఎక్కించుకొని పరారయ్యారు. ఈ మేరకు రంగంలోకి దిగి నిందితులు కిడ్నాప్కు వాడిన కారును ఎడపల్లి వద్ద గుర్తించారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. బాధిత యువకుని నరేశ్గా గుర్తించారు. అఖిలేశ్ అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కిడ్నాప్కు పాల్పడ్డాడు. నిందితులను అదుపులోకి తీసుకొని బోధన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే, కిడ్నాప్కు కారణాలు తెలియాల్సి ఉన్నది.