భీమ్గల్, అక్టోబర్ 17 : టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారు.
తెలంగాణను దేశం గర్వించే స్థాయిలో నిలిపిన సీఎం కేసీఆర్ సేవలు ఈ దేశానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, భీమ్గల్ అభివృద్ధిలో అహర్నిశలు పాటుపడుతున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటామని వారు స్పష్టం చేశారు. భారత్ రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచిన భీమ్గల్ వ్యాపారులకు మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు.